సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలంలోని చౌటపల్లి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.గ్రామంలోని యాదవ సోదరులందరూ తదనంతరం ఉట్టిగొట్టే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల స్వామి దేవాలయ ఛైర్మన్ మద్ది హుస్సేన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణుడు ఎంతో గొప్పవాడని భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుడు అందరికీ ఆదర్శప్రాయుడని శ్రీకృష్ణుడి లీలల గురించి గ్రామ ప్రజలందరికి వివరించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల స్వామి దేవాలయ ధర్మకర్తలు దేవరం రమాదేవి,పల్లపాటి వీరయ్య, ఐతగాణి గన్నువీరయ్య, గుండెపంగు గురవయ్య, పూజారి తిరునగరి శ్రీనివాసాచార్యులు, బలుసుపాటి రవి, ఐతగాణి నరేష్ కంచాల వెంకట్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin