Monday, 27 July 2026 10:40:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ...

Date : 03 September 2023 01:19 AM Views : 322

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి 5 వార్డులో గడప గడప కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాల్ రావు, తూము చౌదరి మాట్లాడుతూ తెలంగాణ వనరులను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుంది అన్నారు. టీఆర్ఎస్ పాలనలో గల్లీకో బెల్ట్ షాపు తప్ప జరిగిన అభివృద్ధి ఏమి లేదన్నారు. ప్రస్తుతం హడావుడిగా మొదలు పెట్టిన అభివృద్ధి పనులన్నీ కమిషన్ ల కోసం తీసుకున్నవని అన్నారు. సామాన్య కార్యకర్తను ప్రధాన మంత్రిని చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీ దేనని, గౌరవం దక్కాలి అన్న, ప్రజా సేవ చేయాలన్న కాంగ్రెస్ పార్టీ ఒక సరైన వేదిక అన్నారు. బిఆర్ఎస్ పాలనలో పేదలకు న్యాయం జరగడం లేదన్నారు. మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబంనికి, కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా కుటుంబ సభ్యులకు మరియు వారి అనుచరులకు తప్ప పేదవాడికి లాభం ఏమి లేదన్నారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తద్యం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, అర్హులందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు,పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక చేయూత, మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, 500/-రూపాయలకే గ్యాస్ సిలిండర్, చదువుకుంటున్న 18 సంవత్సరాల బాలికలకు ఉచిత స్కూటీ మరియు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ లోని అంశాలను పూర్తిగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అయూబ్ ఖాన్, ప్రసాద్, చిమట నాగేశ్వరరావు, సతీష్, ఉదయ్ కుమార్, ఎండి గౌస్, శేఖర్, ఖలీల్, ఉమర్, 5 వార్డు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: