సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : చౌదరి గూడ మండలానికి చెందిన చలివేంద్రం పల్లి గ్రామస్తులు కూలి పనులకు వెళుతుండగా ఆటో బోల్తా పడటంతో పలువురికి గాయాలు అయ్యాయి. వారిని హుటా హుటిన షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు మంచాల లక్ష్మమ్మ, మంచాల శ్రీలత, పాల రాములమ్మ, పంది లక్ష్మమ్మ, మంచాల లలిత, పంది భీమమ్మ అలవేలు, అనిత, అమృత, అంజమ్మ, తదితరులు ఉన్నారు. గాయపడిన వారిని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ హుటాహుడిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గాయపడిన వారిని మండల పార్టీ అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజుతో కలిసి పరామర్శించడం జరిగింది. గాయపడిన వారికి తక్షణ సహాయం కింద 15000 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అప్పారెడ్డి కూడా నరసింహ భౌతిక గాయాన్ని సందర్శించి నివాలి. నందిగామ మండలం అప్పారెడ్డి గూడా గ్రామ ఉపసర్పంచ్ సీతారాం వార్డు సభ్యుడు ప్రభు సోదరుడు నరసింహ భౌతిక గాయాన్ని సందర్శించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నరసింహ మరణం ఆయన కుటుంబానికి గ్రామానికి ఎంతో తీరనిలోటని సంతాపం ప్రకటించారు.
-----------------------
Admin