సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు అయ్యన్నపాత్రుడు, చింతకాయల విజయ్ అక్రమ అరెస్టును ఖండిస్తూ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు,, పెనుకొండ అసెంబ్లీ ఇంచార్జీ శ్రీ బి కే పార్థసారథి ఆధ్వర్యంలో పెనుకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం, రాస్తారోకో నిర్వహించారు. జగన్ ప్రభుత్వం టిడిపి నాయకుల పైన అక్రమ అరెస్టులు, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యన్ని కాపాడాలని, చేతగాని ముఖ్యమంత్రి దిగిపోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బి కే పార్థసారథి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెలిపారు. టిడిపి నాయకులపైన కక్ష కట్టి, అక్రమ కేసులు బనాయించి, సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టిడిపి నాయకులు నిరసన వ్యక్తం చేయడానికి 30 యాక్ట్, 144 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారని, అదే వేల సంఖ్యలో వై సి పి నాయకులు గుమికూడితే వారికి ఎటువంటి సెక్షన్లు వర్తించవు అని చెప్పారు. జగన్ ప్రభుత్వం రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, నగర పంచాయతీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin