సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఘనంగా 138వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలు నిర్వహించిన: టిపిసిసి జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ కాంగ్రెస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఎడవల్లి కొత్తగూడెం నియోజకవర్గం స్థానిక రైటర్ బస్తిలో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో 138వ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిపిసిసి జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ ఆద్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమములో ముందుగా ఎడవల్లి కృష్ణ పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఏ.ఓ హుమే మాజీ బ్రిటిష్ అధికారి 1885 డిసెంబర్ 25న స్థాపన చేయాలి కానీ ప్లేగు వ్యాధి కారణంగా డిసెంబర్ 28న స్థాపించబడింది భారతదేశ స్వాతంత్య్రం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు వారిలో మహాత్మాగాంధి బి.అర్.అంబేత్కర్ మొదలగు అనేకమంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు,కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పుట్టిన పార్టీ అన్నారు కాంగ్రెస్ పార్టీకి 138సం"చరిత్ర ఉంది అన్నారు,స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అంతకు ముందే దేశం కోసం ఎంతో శ్రమించిదన్నారు,సర్వ మత సామరస్యం శాంతి సామరస్యలతో దేశానికి ఒక దిశ నిర్దేశం చేసిన పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు,నేటి పాలకులు కాంగ్రెస్ చరిత్ర పైన దుమ్మెత్తి పోసి ప్రతిష్ట దెబ్బ తియ్యాలని చుస్తున్నారని విమర్శించారు,ఎంత మంది ఏమి చేసిన కాంగ్రెస్ పార్టీకి మట్టి అంటదన్నరు 130కోట్ల ప్రజలకు అన్నీ రకాల భద్రత కల్పించే పార్టీ కాంగ్రెస్ అన్నారు,ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగంలో నేడు భారత దేశంలోనీ పౌరులు మంచి స్థానంలో ఉన్నారు అందుకు కాంగ్రెస్ పాలన కారణమని పేర్కొన్నారు,భారతదేశం యువశక్తి తో ఉంది,కానీ ఇప్పటి పాలకులకు యువతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు, దేశంలో మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు ఎడవల్లి,దేశంలో మత తత్వ రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారన్నారు,తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ దేశంలో అత్యున్నత మైన అనేక కార్యక్రమాలు చేసి దేశ భవిష్యత్ కి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచి అని తెలిపారు,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిన ఘనత కాంగ్రెస్,ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన బి.అర్.యస్ ప్రజలను దోపిడీ చేస్తుంది తెలంగాణ ఉద్యమకారులు అమరవిరులు విద్యార్థులు యువత రైతులు బి.అర్.యస్ పాలనలో మోసపోయారని ఎడవల్లి తెలిపారు. తొమ్మిదేళ్ళ పాలనలో తెలంగాణ ఆకాంక్షలు నేరవెరలేదన్నరు రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ తెలిపారని గుర్తు చేశారు 138వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలోకి తెచ్చి ప్రజలకు అండదండలుగా ఉండాలన్నారు టిపిసిసి జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ. ఈ కార్యక్రమములో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య,లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరరావు,బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,కొత్తగూడెం పట్టణ/లక్ష్మీదేవిపల్లి మండల యస్సీ సెల్ అధ్యక్షులు కల్లేపల్లి రాజా,కొప్పుల రమేష్,పట్టణ మహిళ మైనార్టీ అధ్యక్షురాలు జెరినా,పట్టణ మహిళ అధ్యక్షరాలు వాలి,లీగల్ సెల్ నాయకులు ఆరకల కరుణాకర్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుబ్బారెడ్డి,కలిపాక సత్యనారాయణ,సరంగాఫణి,INTUC నాయకులు జెలిల్, బొజ్జ వెంకటస్వామి,చుంచుపల్లి మండల ఏస్సి సెల్ అధ్యక్షులు డేవిడ్ రాజు,సైమన్, కాంగ్రెస్ నాయకులు మన్ సింగ్,కుషాల్, ఫైజుద్దిన్, వేలేటి వెంకటేశ్వర్లు,మలోత్ లక్ష్మణ్ గడ్డిగుట్ట నరేష్,చుంచుపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులు శనగ లక్ష్మణ్,భూక్యా శ్రీనివాస్,ప్రసాద్ మొద్దు శ్రీను,తదితరులు పాల్గొన్నారు.....
-----------------------
Admin