సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కొనియాడారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వారి కృషిని, పోషించిన చారిత్రక పాత్రను ఆయన స్మరించుకున్నారు. శుక్రవారం కొత్తగూడెంలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడడం గొప్ప విషయమన్నారు. విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నదని ఆయన తెలిపారు. సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అది సాధ్యమని , స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి, నాగేంద్ర త్రివేది, ఆకునూరి కనకరాజు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ మడిపల్లి శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు చిమట నాగేశ్వరావు, అయూబ్ ఖాన్, నిరంజన్ రెడ్డి, కమల్, దుర్గా, నాగరాజు, యువజన కాంగ్రెస్ నాయకులు చీకటి కార్తీక్, సాయి, నరేష్, ఉపేందర్, అజయ్, సతీష్, శేఖర్, నవీన్, జిల్లా నాయకులు, మండల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin