సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలో గల గాంధీనగర్ లో శుక్రవారం విద్యుత్ షాక్ సర్క్యూట్ తో దాసరి స్వప్న భర్త సతీష్ దంపతులకు చెందిన పూరి గుడిసె పూర్తిగా దగ్ధం కావడంతో అందులో ఉన్న సామాన్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది.ఈ సంఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ వెంటనే స్పందించి వారికి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ మాలంపాటి మానవతా దృక్పథంతో వారి స్వంత నిధులతో 25,000 /-రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ ఆర్థిక సాయం పై స్పందించిన బాధితులు సబ్ కలెక్టర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.వీరితో పాటుగా అదే ప్రాంతంలోని కాలనీ వాసులు సబ్ కలెక్టర్ చేసిన ఆర్థిక సహాయానికి అభినందనలు తెలియజేయడం జరిగింది....
-----------------------
Admin