సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్యసాయి జిల్లా, బుక్కపట్నం, ప్రతి జిల్లాలో ఎడారి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉంటారు.కానీ శ్రీసత్యసాయి జిల్లాలో అటవీ అధికారులు అడవులను ,చెట్లను రక్షించాల్సింది పోయి కలప మాఫియాతో కుమ్మక్కై చెట్లను అడవులను నాశనం చేస్తున్నారనీ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని పలుచోట్ల జరుగుతున్న అక్రమ కలప రవాణాదారులపై జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డికి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ నాయుడు మాట్లాడుతూ అటవీ సంపద వనరులను , చెట్లను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. అదేవిధంగా వాల్టా చట్టాన్ని ధిక్కరించి చెట్లను నరికే వారిపైన రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్, పోలీసు అధికారుల సైతం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని DFO ను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన డిఎఫ్ఓ రవీంద్రనాథ్ రెడ్డి... విచారణ జరిపి చెట్లను నరికే వారిపైన, వారికి సహకరించిన సంబంధిత అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అడవులను రక్షించుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. ఇప్పటికే సత్యసాయి జిల్లా బెంగళూరు వాతావరణాన్ని తలపిస్తోందనీ దీన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని DFO సూచించారు.
-----------------------
Admin