సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : విఘ్నేశ్వరుడు దయతో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనీ, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం ఖాయమని ఎమ్మెల్యే వనమా పేర్కొన్నారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ, ఆలయ అర్చకులు శాలువా కప్పి స్వాగతించారు. వినాయక చవితి సందర్భంగా కొత్తగూడెం గణేష్ ఆలయంలో మొదటి పూజ చేసి, విగ్నేశ్వరుడి దీవెనలు తీసుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు. ఈ యొక్క కార్యక్రమంలో గణేష్ టెంపుల్ గుడి చైర్మన్ శ్రీ తాటిపల్లి శంకర్ బాబు,EO సులోచన,మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, బిఆర్ఎస్ నాయకులు మసూద్, రావి రాంబాబు, మాదా శ్రీరాములు, డైరెక్టర్ బాలాజీ నాయక్, బ్యాండ్ దుర్గా, క్లాసిక్ రమణ, నాగేందర్, నగేష్ మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గుడి పూజారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin