సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమానికి నల్లగొండ పార్లమెంట్ సభ్యులు నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి విచ్చేసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ తన చివరి ఊపిరి ఉన్నంతవరకు దేశం కోసం అవిశ్రాంతంగా శ్రమించినారని భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసినారని నేటి భవిష్యత్ తరాల కోసం ముందుచూపుతో ఆలోచించి ఆనాడే ఐటి రంగానికి పునాదులు వేసిన గొప్ప వ్యక్తి అని రాజీవ్ గాంధీ ఆలోచనల వలనే ఈరోజు దేశం ఐటి రంగంలో ముందుకు దూసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో రైల్వే సౌత్ సెంట్రల్ జోనల్ నెంబర్ యరగాని నాగన్న గౌడ్, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, పీసీసీ సభ్యులు దొంగరి వెంకటేశ్వర్లు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి నిజాముద్దీన్, మఠంపల్లి మండల అధ్యక్షులు భూక్య మంజునాయక్, పట్టణ ప్రధాన కార్యదర్శి యడవల్లి వీరబాబు, పట్టణ ఉపాధ్యక్షులు గొట్టెముక్కుల రాములు, జక్కుల మల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్స్ కారంగుల విజయ వెంకటేశ్వర్లు, బొల్లెద్దు ధనమ్మ జైలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాచి మంచి గిరిబాబు, ఐటీ సెల్ నాయకులు సుంకరి శివరాం యాదవ్, ముషం సత్యనారాయణ, కోల మట్టయ్య, ఆకారపు సుదర్శన్, ఐఎన్టీయూసీ నాయకులు చింతకాయల రాము, చలిగంటి జానయ్య, అజ్మతుల్లా యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రెడపంగు రాము, మాజీ అధ్యక్షులు కోలపుడి యోహాన్, బంటు సైదులు, మఠంపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి పులి శ్రీనివాస్, నూకల సందీప్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin