సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండల పరిధిలోని పినపాక పట్టి నగర్ లో అక్రమంగా నిలువచేసిన 80 క్వింటాళ్ల పిడిఎస్ రేషన్ బియ్యం నిల్వచేసి ఉన్నాయని విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ వేణు చందర్ ఎస్సై తిరుపతి, కానిస్టేబుల్ వెంకట్ నారాయణ, విజయ్ సిబ్బందితో కలిసి పేదలకు చెందాల్సిన పిడిఎస్ రేషన్ బియ్యం పట్టుకుని సంబంధిత అధికారులకు అప్పగించారు వివరాల్లోకెళ్తే బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు 46 కొంతకాలంగా ప్రజల దగ్గర తక్కువ రేటుకి రేషన్ బియ్యం కొని ఎక్కువ రేటుకు అమ్ముకుని నయా దందాకి పాల్పడుతున్నాడు.రేషన్ బియ్యం నూకలుగా చేయడం కోసం ఏకంగా మిషన్ ని కొనుగోలు చేసి ప్రజల దగ్గర సేకరించిన బియ్యం మొత్తం అక్కడికి చేర్చి నూకలుగా చేసి సరిహద్దులు దాటిస్తూ లాభాలను అర్జిస్తున్నాడు. పట్టుకున్న పిడిఎస్ రేషన్ బియ్యం మరియు మిషిన్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు....
-----------------------
Admin