సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రతి పేదవానికి లబ్ధి చేకూరడమే బిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని, రాష్ట్రంలో ప్రతి గడపగడపకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయనీ, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం, గతంలో కొత్తగూడెం నియోజకవర్గంలో ఒక లక్ష ఇల్లు కట్టించాననీ, బిఆర్ఎస్ పార్టీని నమ్మండి మీకోసం రాత్రింబవళ్లు పనిచేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపెడుతున్నామని, కాంగ్రెస్, బిజెపి పార్టీలను నమ్మితే అంధకారమేనని ఎమ్మెల్యే వనమా పేర్కొన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలాల్లోని సుమారు 1100 మంది గృహ లక్ష్మీ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన : ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. కొత్తగూడెం మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలంలోని లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన : ఎమ్మెల్యే వనమా సుజాతనగర్ సెంటర్ నుండి ఎమ్మెల్యే వనమాకు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికి, జై కెసిఆర్ జై వనమా అంటూ దిక్కులు పిక్కటిల్లెల నినాదాలు చేసిన గృహలక్ష్మి లబ్ధిదారులు. ఈ యొక్క కార్యక్రమంలో వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఎంపీపీ ముఖ్య విజయలక్ష్మి,RDP శిరీష,DSP అబ్దుల్ రెహమాన్,MRO పుల్లయ్య, మున్సిపల్ కమిషనర్ రఘు,MDO,MPO లు,మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పెద్దమల్ల నరేందర్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, డైరెక్టర్లు, వార్డు నెంబర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin