Sunday, 26 July 2026 11:53:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ లో తెలుగుదేశం పార్టీ మౌన దీక్ష...

Date : 14 September 2023 07:24 AM Views : 322

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా షాద్ నగర్ పట్టణంలో మౌనదీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నెకోట రమేష్ మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ.. 14 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉన్నారు. ఏనాడు అవినీతి, వ్యతిరేక, ఆరోపణలు లేకుండా పరిపాలించారనీ అటువంటి మచ్చలేని మహానీయుడిని ఇలా అక్రమంగా దొడ్డి దారిన అరెస్టు చేశారని అన్నారు. సిల్క్ డెవలమ్మెంట్ సంస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్, ఐటి కొన్ని పెద్ద సంస్థలు కియా గాని ఇలాంటివి ఎన్నో సంస్థలని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ చేశారు. అలాంటి వ్యక్తిని ఈరోజున ఏదో ఒక బురద జల్లడానికి ఈ అరెస్టు చేసి ఒక మచ్చని అంటగట్టారు. దీనికి ప్రతిఫలం తొందర్లోనే ముఖ్యమంత్రి జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం ఆన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాల్రెడ్డి నందిగామ అధ్యక్షులు, విఠ్యాల అంజయ్య పార్లమెంటు సభ్యులు, పట్టణ అధ్యక్షుడు గంధమానంద్, కొత్తూరు అధ్యక్షుడు గురుకుంట గణేష్ గౌడ్, పెద్దిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎం రమేష్, కొందుర్గు అధ్యక్షులు ఎండి రుక్మద్దీన్, నాగులపల్లి అనంతయ్య, ధారలింగం, ఏకుల కృష్ణయ్య, బుడ్డగుల్లా నర్సింలు, చిలుకమరి బాలరాజ్, కుడుముల యాదయ్య, రాములు, కృష్ణయ్య, రవీందర్ రెడ్డి, కే శ్రీను, రాజు, తదితరులు నందమూరి తారక రామారావు అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని ఈ మౌన దీక్షను పాటించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :