సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా షాద్ నగర్ పట్టణంలో మౌనదీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నెకోట రమేష్ మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ.. 14 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉన్నారు. ఏనాడు అవినీతి, వ్యతిరేక, ఆరోపణలు లేకుండా పరిపాలించారనీ అటువంటి మచ్చలేని మహానీయుడిని ఇలా అక్రమంగా దొడ్డి దారిన అరెస్టు చేశారని అన్నారు. సిల్క్ డెవలమ్మెంట్ సంస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్, ఐటి కొన్ని పెద్ద సంస్థలు కియా గాని ఇలాంటివి ఎన్నో సంస్థలని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ చేశారు. అలాంటి వ్యక్తిని ఈరోజున ఏదో ఒక బురద జల్లడానికి ఈ అరెస్టు చేసి ఒక మచ్చని అంటగట్టారు. దీనికి ప్రతిఫలం తొందర్లోనే ముఖ్యమంత్రి జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం ఆన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాల్రెడ్డి నందిగామ అధ్యక్షులు, విఠ్యాల అంజయ్య పార్లమెంటు సభ్యులు, పట్టణ అధ్యక్షుడు గంధమానంద్, కొత్తూరు అధ్యక్షుడు గురుకుంట గణేష్ గౌడ్, పెద్దిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎం రమేష్, కొందుర్గు అధ్యక్షులు ఎండి రుక్మద్దీన్, నాగులపల్లి అనంతయ్య, ధారలింగం, ఏకుల కృష్ణయ్య, బుడ్డగుల్లా నర్సింలు, చిలుకమరి బాలరాజ్, కుడుముల యాదయ్య, రాములు, కృష్ణయ్య, రవీందర్ రెడ్డి, కే శ్రీను, రాజు, తదితరులు నందమూరి తారక రామారావు అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని ఈ మౌన దీక్షను పాటించారు.
-----------------------
Admin