సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ పట్టణ కేంద్రంలో జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పని చేసే కార్మికులకు జిల్లా కార్మిక శాఖ అధికారి రాజ్ కుమార్ లేబర్ కార్డులు పొందాలని , కార్డులు ఉన్నవారు రెన్యువల్ చేసుకోవడంపై, హెల్త్ కార్డు యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్మిక శాఖ అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ .. భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు లేబర్ కార్డుతో పాటు ఈ-శ్రమ్ కార్డు కూడా తప్పనిసరి తీసుకోవాలని ప్రతి ఒక్క కార్మికుడు కార్డులను రెన్యువల్ సమయంలో తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలన్నారు. అప్పుడే హెల్త్ చెకప్ కు అర్హులు అవుతారని, లేనిచో హెల్త్ చెకప్ కు అనర్హులుగా గుర్తించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా న్యాక్ సంస్థ ద్వారా ఒక్క టీంకు 30 మంది కార్మికులకు 15 రోజులపాటు భవన మరియు ఇతరాత్రా నిర్మాణం పనులపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జై భవాని మాత తాపీ మేస్త్రి సంఘం మక్తల్ అధ్యక్షులు కె.గోపి, ఉపాధ్యక్షులు ఎలిగండ్ల బాలప్ప, కోశాధికారి రాంరెడ్డి, మాజీ అధ్యక్షులు సాయిలు, కొండయ్య, కే.అనిల్ మేస్త్రిలు తాయప్ప, క్రిష్ణ, ఆర్. ఆనంద్, సాయిబాబా మరియు జై భవాని మాత తాపీ మేస్త్రి సంఘం మక్తల్ అనుబంధ కర్ని శ్రీ ఆంజనేయ భవన నిర్మాణ కార్మిక సంఘం కర్ని అధ్యక్షులు జి.శంకర్, ఉపాధ్యక్షులు కృష్ణ రెడ్డి, జనరల్ సెక్రెటరీ దండు నాగరాజు, కోశాధికారి ఈదే చిన్న రంగప్ప, పంది వెంకటేష్, జె. శ్రీనివాసులు, జి. సోను, కుమ్మరి రాములు, బోయ రంగప్ప, ఉప్పరి చెన్నప్ప, పంది లింగం, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin