సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మాగనూర్ మండల కేంద్రంలోని బీసీ ఐక్యవేధిక రాష్ట్ర నాయకులు సాలే ఈశ్వరయ్య అకాల మరణం చెందారు. బీసీ ఐక్యవేదిక సంఘ నిర్మాణం కొరకై బీసీ వాదం బలపడటానికై బీసీ భావజాలం వ్యాప్తి చెందడానికి బలహీన వర్గాల కొరకై అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకులు ఆయన మరణం చాలా బాధాకరం బడుగు బలహీన వర్గాలకు తీరని లోటని వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళి అర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ. భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారి కుటుంబానికి బీసీ ఐక్య వేదిక ప్రగాఢ సానుభూతిని బిసి ఐక్యవేధిక నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు గౌడ్ , ఉమ్మడి మహబూబ్ గర్ జిల్లా అధ్యక్షులు కె. రాజు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి లింగం గౌడ్ , నారాయణపేట జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ ముదిరాజ్ , మక్తల్ నియోజకవర్గ నాయకులు సి.తాయప్ప , రామకృష్ణ , రవికుమార్ , బీసీ ఐక్యవేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin