సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సింగరేణి అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు అక్టోబర్ నెలలో హైకోర్టు తీర్పు ప్రకారం పెండింగ్ లో ఉన్న కనీస వేతనాల జీవోలను తక్షణమే అమలకు చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్--AITUC రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం నాడు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో కృష్ణయ్య పాల్గొని మాట్లాడుతూ అక్టోబర్ నెలలో హైకోర్టు తీర్పు ప్రకారం ఆరు వారాల తర్వాత అమలు జరపడానికి అంగీకరించిన ప్రభుత్వం తక్షణమే కొత్త వేతనాల జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే అరకొర వేతనాలతో కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని,కొత్త ప్రభుత్వం కొత్త జీవోలను అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికులు మెరుగైన జీవితాలను కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శివ,ప్రమీల,లక్ష్మి,స్వరూప,నాగమణి,మున్నా,వినోద్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin