Monday, 27 July 2026 02:36:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డిపెండెంట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి..?

Date : 31 January 2024 07:57 AM Views : 490

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సింగరేణి లో ఎన్నికల కారణంగా నిలిచిపోయిన కారుణ్య నియామకాలు, ఎక్స్టర్నల్ ఉద్యోగులను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ జోనల్ ఇంచార్జ్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ సింగరేణిలో మెడికల్ బోర్డు ద్వారా ఆన్ ఫిట్ అయిన కార్మికుల స్థానంలో డిపెండెంట్లకు నియామక పత్రాలు ఇవ్వాలని, అదేవిధంగా నియామక పత్రాలు అందజేసి రెండు రోజులు విధులు నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తెలంగాలో కాంగ్రెస్ అధికాంలోకి వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయనుకుంటే కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉద్యోగాలు వచ్చిన వారికి నియామక పత్రాలు ఇవ్వకుండా, సింగరేణి 177 ఎక్స్టర్నల్ ఉద్యోగాల భర్తీకి నియామకం జరిపిన యాజమాన్యం ఉద్యోగాల్లోకి తీసుకోకుండా కాలయాపన చేస్తుందని,ఉద్యోగ నియామకాల్లో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు మెడికల్ టెస్టులు,ఇంటర్వ్యూలు,కౌన్సిలింగ్ పూర్తి చేసుకోగా వారికి ఆఫీస్ ఆర్డర్లు కూడా ఇచ్చారని వారు జీఎం కార్యాలయాల్లో రిపోర్ట్ కూడా చేశారని ఎన్నికల కోడ్ నెపంతో నియామక పత్రాలు ఇచ్చిన వారిని విధుల్లోకి తీసుకోకుండా ప్రభుత్వం,సింగరేణి యాజమన్యం ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. సింగరేణి ఉద్యోగం రాగానే చాలా మంది చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామ చేసి వచ్చారని ఇప్పుడు వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందన్నారు. డిసెంబర్ 27 తో ఎన్నికల కోడ్ ముగిసిన ఇంకా విధుల్లోకి ఏందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి డిపెండెంట్ ఉద్యోగులకు, ఎక్స్టర్నల్ ఉద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఈకార్యక్రమంలో బహుజన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి, అసెంబ్లీ అధ్యక్షుడు చేనిగరపు నిరంజన్ కుమార్, మాలోత్ వీరు నాయక్, వంగా రవిశంకర్, అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :