సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : దీర్ఘకాలిక అనారోగ్యంతో మృతి చెందిన కొత్తగూడెం న్యాయవాది అనుమకొండ శశిధర్ మృతికి సంతాపంగా ఒక్క రోజు విధులకు గైర్హాజరు కావాలని కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్ మక్కడ్ అధ్యక్షతన లైబ్రరీ హాలులో మంగళవారం నాడు జరిగిన సంతాప సభలో శశిధర్ మృతికి సంతాపం సూచకంగా రెండు నిముషాలు మౌనం పాటించారు. శశిధర్ కు సంతాపం ప్రకటిస్తూ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రావిలాల రామారావు, సంయుక్త కార్యదర్శి కాసాని రమేష్, లైబ్రరీ కార్యదర్శి యాసా యుగంధర్, తోట మల్లేశ్వర్ రావు తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో క్రీడా కార్యదర్శి పిట్టల రామారావు, చీఫ్ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వి.పురుషోత్తం రావు, పొక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.నాగిరెడ్డి, మానిటరింగ్ కమిటీ సభ్యులు జి.వి.కె. మనోహర్ రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు జి.వి.హరి ప్రసాద్, వి. రాజేశ్వర్ రావు, జి.కె. అన్నపూర్ణ, బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు కె. పుల్లయ్య, ఎస్.వి. రామారావు, సింగు ఉపేందర్, అరికాల రవి కుమార్, ఉప్పు అరుణ్, బండ్ల రాజశేఖర్, అంబటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శశిధర్ మృత దేహాన్ని సందర్శించి నివాళి అర్పించి, శశిధర్ కుటుంబాన్ని పరామర్శించారు.
-----------------------
Admin