Monday, 27 July 2026 06:01:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి...

Date : 06 February 2024 12:59 PM Views : 263

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఈనెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె మరియు గ్రామీణ భారత్ బందును జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీలం శీను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోసనబోయిన హుస్సేన్ కోరారు. సమ్మెకు సంబంధించిన సమ్మె నోటీసులు హుజూర్ నగర్ కేంద్రంలోని సి డి పి ఓ విజయలక్ష్మి కి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీలం శీను మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ సామాన్య ప్రజల కార్మిక కర్షక హక్కులపై దాడి చేస్తున్నదని ఆయన అన్నారు. మాటల్లో జాతీయత ఆచరణలో విదేశీ జపం చేస్తుందని దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మి వేస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఉపయోగపడే స్కీములను ప్రైవేటీకరణ చేస్తున్నదని కార్మిక వర్గం ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోడలుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చి వేస్తుందని సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కును కాలరాస్తున్నదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా ఐక్యంగా పిలుపునిచ్చాయని ఈ యొక్క సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు వ్యవసాయ కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఫీల్డ్ అసిస్టెంట్లు మధ్యాహ్న భోజన కార్మికులు సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రన్ మియా అంగనవాడి టీచర్స్ మఠంపల్లి మండల గౌరవ అధ్యక్షురాలు జి లింగమ్మ అధ్యక్షురాలు ఆర్ నీలా బాయ్ కార్యదర్శి సంతోష్ కుమారి నాగమణి ఎం రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: