సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఈనెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె మరియు గ్రామీణ భారత్ బందును జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీలం శీను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోసనబోయిన హుస్సేన్ కోరారు. సమ్మెకు సంబంధించిన సమ్మె నోటీసులు హుజూర్ నగర్ కేంద్రంలోని సి డి పి ఓ విజయలక్ష్మి కి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీలం శీను మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ సామాన్య ప్రజల కార్మిక కర్షక హక్కులపై దాడి చేస్తున్నదని ఆయన అన్నారు. మాటల్లో జాతీయత ఆచరణలో విదేశీ జపం చేస్తుందని దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మి వేస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఉపయోగపడే స్కీములను ప్రైవేటీకరణ చేస్తున్నదని కార్మిక వర్గం ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోడలుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చి వేస్తుందని సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కును కాలరాస్తున్నదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా ఐక్యంగా పిలుపునిచ్చాయని ఈ యొక్క సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు వ్యవసాయ కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఫీల్డ్ అసిస్టెంట్లు మధ్యాహ్న భోజన కార్మికులు సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రన్ మియా అంగనవాడి టీచర్స్ మఠంపల్లి మండల గౌరవ అధ్యక్షురాలు జి లింగమ్మ అధ్యక్షురాలు ఆర్ నీలా బాయ్ కార్యదర్శి సంతోష్ కుమారి నాగమణి ఎం రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin