సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచిన అభ్యర్థి ఏవియన్ రెడ్డిని గెలిపించిన ఉపాధ్యాయులందరికీ మక్తల్ తపస్ శాఖ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు శేర్ కృష్ణారెడ్డి మరియ నరసింహ మాట్లాడుతూ... ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కారం కోసం ఎమ్మెల్సీ ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతామని అన్నారు. చైతన్యవంతంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని అయ్యాలపు వెంకటనారాయణ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించడం ఎంతో శుభసూచకం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనిల్ గౌడ్, కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రఘువీర్ నామాజీ, తపస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగార్జున మండల గౌరవ అధ్యక్షులు భీంరెడ్డి, మండల అధ్యక్షులు రవీందర్,మండల ప్రధాన కార్యదర్శి రాకేష్ కేజీబీవీ,గురుకుల ఉపాధ్యాయులు మాధవి, రాధిక,రేణుక,శ్రీలత,సుధ,శ్వేత, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin