సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన వీరబోయిన మల్లికాంబ కు రాజస్థాన్ లోని సన్ రైజ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో డాక్టర్ రమేష్ కుమార్ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను సన్ రైజ్ యూనివర్సిటీ నుండి మల్లిక డాక్టర్ రేట్ అందుకున్నారు.ప్రొఫెసర్ డాక్టర్ రామ్ మెహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూ అనంతరం బోర్డు సభ్యులు డాక్ట రేట్ ను ప్రకటించారు... మల్లిక ట్రైబల్ గురుకుల డిగ్రీ కళాశాల లో లెక్చరర్ గా ఐదు సంవత్సరాలు పనిచేశారు . తను కబడ్డీ క్రీడా కారిణి గా జాతీయ స్థాయి లో ఆడి ఎన్నో ప్రథమ , ద్వితీయ పతకాలను అందుకున్నారు... పేదరికం నుండి వివాహం అనంతరం కూడా ఎన్నో కష్టాలకుఓర్చి ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డాక్టరేట్ అందుకుని మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిన మల్లికను కుటుంబ సభ్యులు వీరబోయిన వెంకట్, ధృతి చందన, తేజస్విని, కన్నయ్య, పరమేష్ లింగమల్లు, పిచ్చమ్మ, సరిత, మమత, మరియు బంధు, మిత్రులు అభినందనలు తెలిపారు
-----------------------
Admin