సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : పురుషోత్తపట్నంలోని నమ్మక మండపం వద్దకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు రావలసి ఉండగా, ఆలయ ఈవో రమాదేవి గారు నిరాకరించడం జరిగింది. అటువంటి క్రమంలో పురుషోత్తపట్నంలోని ప్రజలందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ల ఊరిలోనే ఉన్న రాముల వారి ఉత్సవ విగ్రహాలను రాపత్తు సేవ లో ఘనంగా రంగవల్లికల మధ్యలో నుంచి టపాసులు పేలుస్తూ జైశ్రీరామ్ అని పలుకుతూ భక్తుల యొక్క నినాదాలతో ఊరేగింపుగా సెయింట్ ఆన్స్ స్కూల్ జంక్షన్ దగ్గర నుంచి వేస్ట్ ల్యాండ్ మీదుగా పురుషోత్తపట్నం రామాలయానికి తీసుకు వెళ్లడం జరిగింది. అనంతరం అక్కడ ఘనంగా స్వామి వారికి పూజలు నిర్వహించి, సంస్కృతిక కార్యక్రమాలను కూడా భక్తుల కొలహాలు మధ్య నిర్వహించడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ఇద్దరు పిల్లలకు గౌరవ ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి సాలువాతో సత్కరించడం జరిగింది..అనంతరం భక్తులందరూ. కూడా తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది....
-----------------------
Admin