సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ముస్లిం లు పవిత్రంగా భావించే చివరి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహివాసల్లం జన్మదినం సందర్బంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. కులమాతలకు అతీతంగా గంగా జామున తహజీబ్ గా విరాజిల్లుతు పెద్దలు, పిల్లలు, యువకులు పెద్ద ఎత్తున అందరు ఇందులో పాల్గొన్నారు. స్థానిక మినీ చౌరస్తా ( ఈద్గా ) మైదానం నుండి బయలుదేరిన ఈ భారీ ర్యాలీ పటేల్ రోడ్ జామ మస్జీద్ మీదుగా షాద్ నగర్ ముఖ్య కూడలి (చౌరస్తా) వరకు తదానంతరం ఫరూఖ్ నగర్ లోని విధుల గుండా సాగుతు పాత జాతీయ రహదారి లో గల ఆశియనా హోటల్ వెనుకాల గల వాటర్ ట్యాంక్ వద్ద ముగిసింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణ సీఐ ప్రతాప్ లింగం అధ్యర్యంలో భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవంచనియా సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్త్ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ లో ముస్లిం మత పెద్దలు అజార్ హఫీజ్, షోయబ్ అత్తారి హఫీజ్, మైనారిటీ నేతలు జమృద్ ఖాన్, కో ఆప్షన్ మెంబెర్ గౌస్ జానీ, కౌన్సెలర్ లు సర్వర్ పాషా, ఎంఐఎం గౌస్, ఏజాజ్ (అడ్డు ), సయ్యద్ మాసూద్ అలీ, వైయస్ఆర్టిపి మహమ్మద్ ఇబ్రహీం, బాబా గోరి, ఖాజా డి ఎక్స్, జఫర్, కబీర్, షఫీ, ముబీన్ ఖాన్, జిలాని, సాదిక్, అల్తాఫ్, మతిన్, ముబారక్ అలీ ఖాన్, రషీద్, డీలర్ గౌస్, యూసుఫ్, హామీద్, అబ్బాస్, అశు, సైఫ్, అర్బాజ్, నిజాం, అజ్జు, ఖలీద్, పాషా, భారీద్, మున్ను, ఫారుక్, రహ్మత్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin