సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పరిగి మండలంలోని శాసన కోట రెవిన్యూ గ్రామం నందు నీటమునిగిన పంటపొలాలను మండల అధికారులతో కలిసి మాజీ మంత్రి, సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ పరిశీలించారు. దాదాపుగా 400 ఎకరాలు విస్తీర్ణంలో నీట మునిగి నష్టపోయిన పంటపొలాల రైతుల వివరాలను ప్రాథమిక విచారణ కింద జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం వారికి త్వరిత గతిన అందజేయాలని ఎమ్మెల్యే శంకర నారాయణ సూచించడం జరిగింది. *ఈ కార్యక్రమంలో తాసిల్దార్, మండల వ్యవసాయ అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎస్.ఐ., విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ సిరికల్చర్ అసిస్టెంట్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.
-----------------------
Admin