సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : జిల్లాలో ఇంటి పన్ను వసూలు నిర్దేశించిన సమయంనాటికి నూరు శాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సర్పంచుల పదవీ కాలం త్వరలో ముగియనున్నందున పారదర్శకంగా అన్ని జి.పి.లకు ప్రత్యేక అధికారుల నియామక ప్రణాళికలు సిద్ధంచేయాలని సూచించారు. ముక్యంగా ఎక్కడకూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించవద్దని పేర్కొన్నారు. జి.పి లలో పన్ను వసూలు నిర్దేశించిన సమయానికి నూరు శాతం వసూలు అయ్యేలా చూడాలని, ఇప్పటివరకు 56 శాతం పన్ను వసూలు చేయడం జరిగిందని అలాగే ఎం.పి.ఓ లు పన్ను వసూలు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీల నుండి కూడా పన్ను వసూలు చేపట్టాలని సూచించారు. జి.పి.లలో అత్యవసరమున్న జి.పి. భవనాలు, కాంపౌండ్ వాల్స్, పాఠశాలలో అదనపు గదులు నిర్మాణం అలాగే మరమ్మత్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిశగా ప్రతిపాదనలు ఉండాలని సూచించారు. జి.పి.లలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ ఖర్చు చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు ఈ గ్రామ్ స్వరాజు పోర్టల్ లో అప్ లౌడ్ చేయాలని సూచించారు. 197 జి.పి.లలో ఎఫ్.టి.ఓ ల మేరకు చేపట్టిన మరుగుదొడ్ల లకు నిబంధనల మేరకు చెల్లింపులు చేపట్టాలని తెలిపారు. అనంతరం మండలాల వారీగా ఇంటి పన్ను వసూలు, ప్రత్యేక అధికారుల నియామకం, ఈ జి ఎస్ పనుల పై సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు.ఈ సమావేశంలో సి.ఈ.ఓ సురేష్ కుమార్, డిఆర్డీఓ కిరణ్ కుమార్, డి.పి.ఓ యాదయ్య, ఎంపీడీఓ లు, ఎం.పి.ఓ లు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin