సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డ్ పార్కులో పాదాచారులతో చిట్ చాట్... - గెలిచిన నెల రోజుల్లో గంజాయి రౌడీ ముఖాల బారి నుండి ఆర్మూర్ ప్రజలకు విముక్తి కల్పిస్తాం... ఉన్నత విద్యవంతులు తమ ఓట్ల హక్కును ఎన్నికల్లో వినియోగించుకోవాలని ఓటే మార్పుకు తొలిమెట్టని ఆర్మూర్ పట్టణం లోని హౌసింగ్ బోర్డ్ లోని పార్క్ లో పాదాచాలతో బిజెపి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో 100 మంది పాదాచార్యులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలు వ్యాయామం చేసుకోవడానికి ఇలాంటి పార్కులు ఉండవని ఇప్పటికే ప్రభుత్వ భూములను అమ్మిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్నిదేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే దేవాలయాలు భూములు అన్ని మసీదులు అభివృద్ధికి పాటుపడుతుందని ఉన్నత విద్య కలిగిన వారు ఎన్నికల రోజున ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వలన అమాయకపు ప్రజలను మభ్యపెడుతూ నోట్లకు ఓట్ల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని సమాజం పట్ల అవగాహన కలిగి ఉన్న నాయకుడిని ఎన్నుకునే బాధ్యత ఏ గెలిపించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందని అని అన్ని తెలిసినా కూడా కొందరు యువత, విజ్ఞావంతులు మనకెందుకులే అనుకోని ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వలన అసమర్థత నాయకులు పరిపాలిస్తున్నారని ఆయన తెలియజేశారు. తాను గెలిచిన నెల రోజులలో గంజాయి,రౌడీ ముఖాల బాధ నుండి ఆర్మూర్ ప్రజలకు కాపాడుతానని హామీ ఇవ్వడం జరిగింది. ఒకే ఆయుధం కోర్టు హక్కును వినియోగించుకోవాలని వారు సూచించారు. సంబంధ వర్గాల అభివృద్ధికి బిజెపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో స్థానిక ప్రజలు మాజీ ఆర్మూర్ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు యామాద్రి భాస్కర్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ఆకుల రాము, జాకీర్ హుస్సేన్, బండ్ల వివేక్, గిరిధర్, వివేక్ వాకర్స్, టీం అసోసియేషన్ అధ్యక్షులు బట్టు గంగాధర్ మరియు సభ్యులు హ్యాపీ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పొంగి మనోహర్ సెక్రటరీ కాంతయ్య మరియు సభ్యులు పాల్గొన్నారు.
-----------------------
Admin