సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కొమరం భీమ్ కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేద ఆదివాసులకు గృహ జ్యోతి పథకం ద్వారా వెంటనే కరెంటు సౌకర్యం కల్పించి ఇంటి స్థలాలకు పట్టాలు నీళ్లు విద్య వైద్య సౌకర్యాలు కల్పించాలనికోరుతు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తేదీ 6/1/2025 సోమవారం రోజున అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ చౌక్ యందు తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యలు ధనసరి సీతక్క గారికి మరియు ఎంపీ ఎమ్మెల్యే జిల్లా ఉన్నతాధికారులు కలిసి మెమొరండం సమర్పించడం జరిగింది మెమోరండమిస్తూ ఈ సందర్భంగా అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో కొమరం భీం కాలనీలో ఆదివాసీలు నివసిస్తున్నారు కావున తమరు మంత్రివర్యులు, ఎంపీ గోడం నగేష్ గారు మీరు ఇద్దరు ఆదివాసి బిడ్డలే కాబట్టి స్పందించి ఆదివాసులకి పట్టాలు కరెంటు నీళ్లు విద్య వైద్యం సౌకర్యాలు కల్పించాలని మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా తుడుం దెబ్బ రాష్ట్ర కోకన్వినర్ గోడం గణేష్ మాట్లాడుతూ ఆదివాసీలు ఇంటింటికి చందాలు జమ చేసి హ్యాండ్ బోర్స్ వేయడం జరిగింది అదేవిధంగా కరెంటు పోల్స్ వేయడం జరిగింది కావున తమరు మాకు కరెంటు కనెక్షన్ ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అదిలాబాద్ జిల్లా కేంద్రం చుట్టూ కరెంటు ఉంది కానీ కొమురం భీం కాలాని ఆదివాసులకు కరెంటు లేదు రాదు మేం ఏం నేరం చేసినమ్ మాకు ఎందుకు ఈ శిక్ష ఈ సమాజంలో మేము మనుషులం కాదా కొమరం భీం కాలనీలో నివాసముంటున్న ఆదివాసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆదిలాబాద్ ఇంచార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు మానవత దృక్పథంతో స్పందించి తక్షణంగా కరెంట్ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా అక్కడ మౌలిక సదుపాయాలైనటువంటి తాగునీరు రోడ్డు విద్యా వైద్యం మొదలగు సమస్యలు పరిష్కరించాలని వివరించడం జరిగింది ఇప్పటికైనా మమ్ముల్ని మనుషులుగా గుర్తించి మాకు కరెంటు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము గత 11 సంవత్సరాల నుంచి చీకటిలో విషెస్సర్పాలతో తెళ్ళతో పోరాడుతూ చీకటి వేస్తేనే భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాము మా పిల్లల చదువుల కోసం మా భవిష్యత్తు కోసం అడవిని ఈడిసబెట్టి పట్టణాలకు బతకడానికి వచ్చి పిల్లల భవిష్యత్తు చదువుకోవడానికి వచ్చి రూము కిరాయి కట్టుకోక పొట్ట చేతను పట్టుకొని చీకటిలో ఎలాంటి సౌకర్యము లేకపోయినా ప్రభుత్వ భూమి అయిన కొమరం భీం కాలనీలో నివసిస్తున్నాము కావున మాపై దయతలించి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము మా భవిష్యత్తు కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం వెంటనే స్పందించి మాకు గృహ జ్యోతి పథకం కింద కరెంట్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో గోడం గణేశ్ [తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్] [వేట్టి మనోజ్ తుడుందేబ్బ జీల్లా ప్రదాన కార్యదర్శి] ఉయిక ఇంద్ర [మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు] ఆత్రం గణపతి [డివిజన్ ఉపాధ్యక్షులు] ఆత్రం భుజంగరావు [రైతు సంఘం డివిజన్ అధ్యక్షులు] మేశ్రమం తులసిరాం [రైతు సంఘం డివిజన్ ఉపాధ్యక్షులు] తోడ సాం ప్రకాష్, కుంర గోవింద్ , మరియు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin