సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం సీనియర్ జర్నలిస్ట్ కరాటే సదానoదం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం చుంచుపల్లి మండల పాత్రికేయుల ద్వారా తెలుసుకున్న బిజెపి నాయకులు, రంగా కిరణ్ ట్రస్ట్ అధినేత కె.వి.రంగా కిరణ్ మానవతా దృక్పథంతో సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. 5000 రూపాయలు విలువైన నిత్యవసర సరుకులతో పాటుగా, వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలను సదానందం కు అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని హనుమాన్ బస్తి ప్రాంతానికి చెందిన కరాటే సదానందం అనారోగ్యం వల్ల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణించడంతో వైద్యం చేపించుకోలేని విషయాన్ని విలేకరుల ద్వారా తెలుసుకున్న రంగా కిరణ్ చేయూత అందించారు. రాబోయే రోజుల్లో కూడా తన వంతుగా అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు వార్తా రిపోర్టర్ బాబు, సూర్య స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ షఫీ, సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ, కరాటే మాస్టర్ ఈ మొగిలి, తోటి పాత్రికేయ వర్గం అఫ్జల్ పటాన్, తెలంగాణ సురేష్, నక్క శాంసన్ రాజు,కిరణ్, సురేష్, రాందాస్, మోహన్, కొట్టి నవీన్, రాజ్ కుమార్, ప్రజా జ్యోతి నరేష్, మరియు బిజెపి SC మోర్చా రాష్ట్ర ప్రధాన ప్రతినిధి చింతల చెరువు శ్రీనివాస్, జిల్లా OBC మోర్చా కోశాధికారి జల్లారపు శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin