సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ అనుసంధానమైన నూతనంగా ఏర్పాటుచేసిన రైతు బజార్ ను ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ , సబ్ కలెక్టర్ వెంకట త్రివి నాగ్, ఎర్రగొండపాలెం టిడిపి పార్టీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి రైతు తను పండించిన పంటను వారి కేటాయించిన షాపులోనే అమ్ముకునే విసులుబాటు కల్పించామని ఆయన అన్నారు. అంతేకాకుండా రైతు బజార్ ద్వారా నాణ్యమైన కూరగాయలు అందించడమే కాకుండా తక్కువ ధరలు మనకు కావాల్సిన కూరగాయలు లభిస్తాయని ఆయన అన్నారు. రైతు బజార్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, దోర్నాల లో కూడా రైతు బజార్ కోసం ఏర్పాటు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజలు రైతు బజార్ ను సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి, ఏరి క్షణ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఏడి, ఉపేంద్ర కుమార్, మండల టిడిపి అధ్యక్షులు చేకూరు సుబ్బారావు, అధికారులు, రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin