సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలంలో గల బాలికల పాఠశాలలో, ప్రధమ్ ఇన్ఫోటెక్ ఫౌండేషన్, సాప్ మరియు ఐటీసీ సహకారంతో డిజిటల్ మేళా నిర్వహించారు... ప్రభుత్వానికి సంబంధించిన 20 పాఠశాలల లో గల విద్యార్థులకు వారు నేర్చుకున్న కంప్యూటర్ విద్యపై డిజిటల్ ఎడ్యుకేషన్ మేళా నుండి నమూనాలు తయారు చేయించారు. డిజిటల్ మేళాలో 6వ తరగతి విద్యార్థినిలకు సోషల్ మీడియాపై, మరియు 7వ తరగతి విద్యార్థినిలకు మేడిన్ ఇండియా ఎమ్మెస్ ఎక్స్ఎల్ సైబర్ సెక్యూరిటీ పై పవర్ పాయింట్లలో, అదేవిధంగా 8వ తరగతి విద్యార్థినులకు స్క్రాచ్ లో మిషన్ చంద్రయాన్ -3,యానిమేషన్, అదేవిధంగా 9వ తరగతి విద్యార్థులకు కెరియర్ ఇన్ ఐటీ హెచ్ టి ఎం ఎల్ లలో వెబ్ పేజ్ క్రియేషన్ పై అవగాహన కల్పించారు. 10వ తరగతి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ గూగుల్ మ్యాప్స్ పై అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాలకు సంబంధించిన పలువురు ఉపాధ్యాయులు జి. లోకరాజు , ఆర్.నవీన్,బి. కొండరావు, జి.సాయి లక్ష్మి, పి. కళ్యాణి , పాల్గొన్నారు. విద్యార్థినిలకు కంప్యూటర్లో గల అనేక విషయాలపై ఉపాధ్యాయులు అత్యంత శ్రద్ధ కనబరచి వారికి అర్థమయ్యే విధంగా విద్యార్థులకు వాటిపై సరియైన అవగాహన కలిగించే విధంగాఉపాధ్యాయలు విద్యార్థులపై వారి ప్రేమను కనబరిచారు.
-----------------------
Admin