సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పురపాలక సంఘం కార్యాలయంలో చైర్ పర్సన్ పండిత వినీత పవన్ , కమిషనర్ ప్రసాద్ చౌహన్ ఆధ్వర్యంలో వర్షాకాల దృష్ట్యా పారిశుధ్య కార్మికులు ఇబ్బంది పడవద్దని వారికి రైన్ కోట్లను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు మాట్లాడుతూ ఈ సీజన్లో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు అవకాశం ఉంటుంది కావున వాటి యొక్క లార్వాలను నిర్మించడం కొరకు యాంటీ లార్వా స్ప్రేయర్ మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సానిటరీ జవాన్లకి సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా చెత్తను ఎక్కడ బయట వేయకుండా మున్సిపల్ వాహనాలకి అందించాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరడమైనది ఇట్టి కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పూర్ణ మౌళి కార్మిక సంఘ నేత బాబురావు సానిటరీ జవాన్లు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
-----------------------
Admin