సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం లో గౌని పల్లి లో విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేసిన జడ్పిటిసి, ఎంపీటీసీ, అల్లాపల్లి గ్రామ సర్పంచ్ మాకo వెంకటరమణ ప్ప ఓబుల దేవర చెరువు మండల పరిధిలో ఉన్న గౌని పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 56 మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే ట్యాబులను ముఖ్య అతిథులు జడ్పిటిసి దామోదర్ రెడ్డి , ఎంపీటీసీ కేశవప్ప , అల్లాపల్లి గ్రామ సర్పంచ్ మాకo వెంకటరమణ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి ఏర్పాటు చేసిన సభలో అందజేశారు. ఈ సందర్భంగా జడ్పిటిసి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో విప్లవనాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా అత్యాధునికమైన వసతులతో కూడిన పాఠశాలలను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కార్పొరేట్ స్థాయి స్టాoడర్స్ ను ప్రభుత్వ పాఠశాలలో మై oటైన్ మెయింటైన్ న్ చేస్తూ పేద విద్యార్థి మంచి ఉన్నత స్థాయి ఎదిగే విధంగా చర్యలు చేపట్టారన్నారు . ఈనాడు మనం బహిరంగ సభలో అనేక చూస్తూ ఉన్నాము ప్రభుత్వం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఏ విధంగా ఇంగ్లీషులో అనర్హలo గా మాట్లాడగలుగుతున్నారో ప్రతి ఒకరికి తెలుసన్నారు. మరో అడుగు ముందుకేసి పిల్లలు మెరుగైన బోధన అందించాలని ఉద్దేశంతో బై జ్యూస్ వారితో ఒప్పందం చేసుకొని యానిమేషన్ త్రీ పర్సెంట్ రూపంలో విద్యాబాల సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా సాంసంగ్ ట్యాబులను ప్రభుత్వ పాఠశాలల చదువుతున్న విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. కాబట్టి విద్యార్థులు సదుపాయాన్ని సక్రమంగా వినియోగించుకొని జగనన్న కలలు కన్న శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, వైఎస్ఆర్సిపి నాయకులు ఆనంద్ రెడ్డి, రత్న శేఖర్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి బోర్వెల్, పాఠశాల కమిటీ చైర్మన్ కేశప్ప, చౌడంపల్లి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin