సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం : దేశవ్యాప్తంగా మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతూ బీజేపీ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా ఐటీ సెల్ ద్వారా వివిధ తరగతుల వర్గ ప్రజల మధ్య తీవ్ర ఘర్షణకు ప్రయత్నం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవనంలో జరిగిన జిల్లా సోషల్ మీడియా వర్క్ షాప్ నాయకులు పి ఝాన్సీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో బీజేపీ శ్రేణులు విషం కక్కుతూ పచ్చి అబద్ధాలతో ప్రజలను మాయ పరచాలని చూస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో వందలాది మంది ఉద్యోగులను పెట్టుకుని ఫేక్ ఐడి లు సృష్టించి మరీ లౌకిక పార్టీల విధానాలపై అసభ్యకరమైన భాషతో దొంగ ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని, దేశ ప్రజలను, దేశ వనరులను అదానీ లాంటి వారికి అమ్మి, ప్రశ్నించిన వారిపై, విమర్శలు చేసిన వారిపై దేశ ద్రోహులు అని ముద్ర వేయడంలో బీజేపీ ఐటీ సెల్ ముందు వుందని విమర్శించారు. బీజేపీ అబద్దాల ప్రచారంపై ఎప్పటి కప్పుడు సీపీఎం పార్టీ శ్రేణులు శాస్త్రీయ ఆధారాలతో బీజేపీ ప్రభుత్వం విధానాలను ఎండగట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు పిట్టల రవి, వై విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin