సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాల శ్రీకృష్ణ అష్టమి పండుగ సందర్భంగా ఆర్మూర్ లోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో రంగ రంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా ఆర్డిఓ తిరుక్కో వేల వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా లైఫ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భాను రామగిరి గారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. విశిష్ట అతిధులు లైన వినోద్ కుమార్ గారు కృష్ణుడు గొప్పతనం గురించి మాట్లాడుతూ ఇంత పెద్ద పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు పాఠశాల కరస్పాండెంట్ అయిన పోలపల్లి సుధాకర్ గారి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యఅతితులైన శ్రీ భాను రామగిరి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భగవద్గీత నేర్చుకొని అందులోని శ్రీకృష్ణుని విశిష్టత గురించి తెలుసుకోవాలని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో చిన్న చిన్న పిల్లలు గోపిక కృష్ణ వేషాధనతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం భాగంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పోలపల్లి సుధాకర్ గారు మాట్లాడుతూ కృష్ణాష్టమి మా పిల్లలతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ వేడుకల్లో విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
-----------------------
Admin