సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ భవనం నందు నేడు ఉచిత కంటి వెలుగు శిబిరం నిర్వహించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొడికే అంబదాస్ అన్నారు. ఈ సంద్భంగా అయన మాట్లడుతూ, ఉచిత కంటి పరీక్షకు వచ్చేవారు 50 సంవత్సరాలు పైబడి ఉండాలని ఆయన తెలిపారు. పరీక్షకు వచ్చేవారు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు జిరక్స్ కాపీలు తీసుకు రావాలన్నారు. ఇట్టి శిబిరంలో అర్హులైన వారికి లైన్స్ క్లబ్ కంటి దవాఖాన ఎనుగొండ మహబూ బ్ నగర్ కు తీసుకెళ్లి ఉచిత కంటి అపరేషన్ చేయబడుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని మక్తల్ పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
-----------------------
Admin