సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఎన్నికల నిర్వహణలో రూట్ మొబైల్ విధులు ప్రధాన్యమైనవి అని ఎస్పీ రాహుల్ హెగ్డే ఐ పి ఎస్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం లో గల పబ్లిక్ క్లబ్ హాల్ నందు రూట్ మొబైల్స్ డ్యూటీ సిబ్బందితో సమావేశం నిర్వహించి విధులపై సలహాలు, సూచనలు అందించారు. ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరిలించడం, ఎన్నికల అనంతరం స్ట్రాంగ్ రూమ్ లకు తరలించడం విధులు చాలా ముఖ్యమైనవి తెలిపినారు. ఎలాంటి అవరోధాలు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అని, పోలింగ్ విధులలో ఉన్న సిబ్బందితో సమన్వయం కలిగి ఉండాలని తెలిపినారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నందు, వికాస్ ఫార్మసీ కళాశాల నందు సెంట్రల్ ఆర్మ్ ఫోర్స్ సిబ్బంది తో మాట్లాడి ప్రజలకు భద్రత కల్పించాలని కోరినారు. ఆర్మ్ సిబ్బంది ఎవ్వరూ పోలింగ్ బూత్ లోకి వెళ్ళవద్దు అని తెలిపినారు. ఎవ్వరిపై లాఠీ చూపవద్దు అని కోరినారు. స్థానిక అధికారుల పూర్తి సమాచారం ఉండాలి అన్నారు. ఎస్పీ వెంట డి ఎస్ పి నాగభూషణం, సీఐ రాజశేఖర్, అశోక్, సిబ్బంది ఉన్నారు.
-----------------------
Admin