సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : డాక్టర్ సుదర్శన్ నాయుడు హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో లింగగిరిరోడ్ లో గత 20 సంవత్సరాలుగా అభయ హాస్పిటల్ నిర్వహిస్తూ హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక మంది ప్రజలకు రాత్రనకా పగలనకా వైద్య సేవలు అందిస్తూ ఆదివారం నాడు రాత్రి అనారోగ్యంతో అకాల మరణం చెందినారు. హుజూర్ నగర్ డివిజన్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ ఆధ్వర్యంలో హుజూర్నగర్ మండలంలోని డివిజన్లోని ఆర్ఎంపి పి.ఎం.పి గ్రామీణ వైద్యులు డాక్టర్ సుదర్శన్ నాయుడు భౌతిక కాయంపై పూలమాలలు వేసి కన్నీటి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించినారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి సంతాపం తెలిపినారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఆర్ఎంపీ సంఘం గౌరవ అధ్యక్షులు షేక్ బాబు హుజూర్నగర్ మండల ప్రధాన కార్యదర్శి సన్నిధి వెంకటేశ్వర్లు కోశాధికారి ఆత్కూరి శ్రీనివాస్ సిహెచ్ కోటేశ్వరరావు పి బ్రహ్మం టి రమేష్ జి మర్రెడ్డి షేక్ అమీనా డి వెంకటాచారి షేక్ మీరా వెంకటేశ్వర్లు ఆర్ అంజి ఎండి రషీద్ ఆర్ మురళి ప్రసాద్ నాగుల్ మీరా హుజూర్ నగర్ మండలంలోని ఆర్ఎంపి పిఎంపీలు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు....
-----------------------
Admin