సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, కేశంపేట్ మండల్ / తెలంగాణ హరితోత్సవంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం సోమవారం రోజు కేశంపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటిన కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. మానవ నిర్మిత అద్భుతమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకే కాదు.. ప్రపంచంలోనే గ్రీన్ కవర్ పెంచే.. మూడో అతిపెద్ద మానవ ప్రయత్నానికి కేరాఫ్ అడ్రస్ మన తెలంగాణ. భవిష్యత్తు తరాలకు మనమిచ్చే వారసత్వ సంపద కాంక్రీట్ జంగిళ్లు కాదు. పచ్చని అడవులని సమస్త ప్రజానీకానికి గుర్తుచేసిన సందర్భమిది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను తలదన్నేలా.. ఈ గ్రీన్ వాల్ ఆఫ్ తెలంగాణ నిర్మాణంలో.. భాగస్వాములైన ప్రకృతి ప్రేమికులందరికీ హృదయపూర్వక దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు కేశంపేట మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మార్వో ఆజాం అలీ, ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి, స్థానిక సర్పంచ్ తలసాని వెంకట్ రెడ్డి, కొత్తపేట సర్పంచ్ నవీన్ కుమార్, ఎంపీఓ నరసింహులు, ఈజీఎస్ ఈసీ అజిజ్ అహ్మద్, టెక్నికల్ అసిస్టెంట్ నీలకంఠం బాబు, ఉప సర్పంచ్ దశరథం, నక్క గోపాల్, ఎమ్మార్పీఎస్ సురేష్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin