సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట డి కుమార్ రిపోర్టర్,,,,,,,,,,,,,, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా బుధ వారం నాడు హన్మకొండకు విచ్చేశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు సీఎం కు హృదయపూర్వక స్వాగతం పలికారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హన్మకొండలోని పి జి ఆర్ గార్డెన్స్ నిర్వహించబడిన దశదిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు నివాళులర్పించడానికి, అలాగే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరామర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు కూడా హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. సీఎం పాటు మాధవరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, జిల్లా మరియు మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు..
-----------------------
Reporter