సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ సంస్కతి సాంప్రదాయాల కు దేవాలయాలు నిదర్శనం అని *హుజూర్నగర్ అభివృద్ధి ప్రధాత ప్రధాత, శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు . హుజూర్ నగర్ మండలం లోని కరక్కాయల గూడెం గ్రామంలో నూతన శివాలయ శంకుస్థాపన మహోత్సవంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాంతాలు, వర్గాల వారీగా జరిగే జాతర లకు ప్రభుత్వ ప్రాధాన్యత లభించింది అన్నారు. మతాలకు అతీతంగా ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించడం అనేది తెలంగాణ లో మినహా మరెక్కడా లేదన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ప్రజలు మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలని శివయ్య తండ్రిని వేడుకున్నారు.దేవాలయాల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ని సర్పంచ్ కుటుంబ సభ్యులు శాలువాగప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ,మార్కెట్ కమిటీ చైర్మన్,స్థానిక సర్పంచ్ వార్డు నెంబర్లు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, అభిమానులు భక్తులు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin