సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలోని జ్యోతిబాపూలే బిసి బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలన ఆర్మూర్ నుండి తరలించే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి మరియు బీజేవైఎం ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.వీ నరసింహారెడ్డి ,బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జస్సు అనిల్ కుమార్ ,బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలికోట ప్రశాంత్ మాట్లాడుతూ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో సుమారు 450 మందివిధ్యర్దినులు విద్యను ఐదో తరగతి నుండి పదవ తరగతి వరకు అభ్యసిస్తున్నారని .ఎందరో విద్యార్థినులు ఈ గురుకుల పాఠశాలలో చేరడానికై ఉచ్చ పడుతున్నారని .కానీ వారి ఉత్సాహానికి నీరు గారుస్తూ ఈ యొక్క గురుకుల పాఠశాలను ఇక్కడి నుంచి తరలించే యోజన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం వలన విద్యార్థినులతో పాటు విద్యార్థి నుల తల్లిదండ్రులు సైతం ఆందోళనకు గురవుతున్నారని. ఎక్కడో మారుమూల గ్రామాల్లోఈ విద్యా సం స్థను తరలించడం కారణంగా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అని విద్యార్థినుల తల్లిదండ్రులు భయాందోళనకు గురి అవుతున్నారని. అందుకే స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తక్షణమే స్పందించి పాఠశాల తరలింపును ఉన్నత అధికారులతో మాట్లాడి తరలించకుండా చూసే బాధ్యత ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైనే ఉందని .మరి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటారో లేదా నిస్సహాయతతో తరలింపుకై ముందుకెళ్తారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని బిజెపి డిమాండ్ చేస్తూ. వెంటనే ఈ గురుకుల పాఠశాలను తరలించే యోచనను మానుకోవాలని లేనట్లయితే విద్యార్థినుల మరియు విద్యార్థిని తల్లిదండ్రులను భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్ ఉపాధ్యక్షులు సాయినాథరెడ్డి పెద్దోళ్ల భరత్ దళిత మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పులి యుగంధ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin