సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాదనగర్ అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అభివృది కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండిఏ రూ.10 లక్షల రూపాయలతూ సుజాత ఇంటి నుంచి సి. చంద్రయ్య ఇంటి వరకు, పూర్ణం శేఖర్ ఇంటి నుంచి బొగ్గు బాలమ్మ ఇంటి వరకు సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. మన్ మర్రి నర్సింహ ఇంటి నుంచి జహంగీర్ ఇంటి వరకు రూ,9 లక్షల 20 వెలు సిసి రోడ్డు పనులు, భజనకోట నుంచి కట్ట వెంకటేష్ ఇంటి వరకు 8 లక్షల 30 వేలు, రాజు ఇంటి నుంచి విష్ణు శర్మ ఇంటి వరకు పట్టణ ప్రగతి కింద 6 లక్షల రూపాయలు యాదగిరి ఇంటి వరకు సిసి రోడ్డు పనులకు, మొత్తం 46 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు, నాయకులకు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ ఈటా గణేష్, మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, వైస్ ఛైర్మన్ నటరాజన్, మైనార్టీ నేత జమృత్ ఖాన్, స్థానిక కౌన్సిలర్ పిల్లి శారదా శేఖర్, గుడిపల్లి మల్లయ్య, కె.రాములు, కె.మల్లేష్, ఎన్. మల్లేష్, గుడిపల్లి శంకరయ్య,పద్మశాలి రాములు, ఆర్పీ భారతమ్మ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin