సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట సర్కార్ న్యూస్ మహాత్మా గాంధీ 156 వ జయంతి వేడుకలను చెన్నారావు పేట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్దన రమేష్ మండల నాయకులు కాంగ్రెస్ నాయకులతో కలిసి జాతిపిత మహాత్ముని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్ళర్పించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ మాట్లాడుతూ భారతదేశాన్ని వందల ఏళ్లకు పైగా పరిపాలించిన బ్రిటిష్ వారిని సత్యం అహింస సత్యాగ్రహం అనే నినాదాలతో భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపై నడిపించి బ్రిటిష్ పాలన నుండి విముక్తి కల్పించి స్వతంత్రం తీసుకొచ్చిన మహా నాయకుడు జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు..మహాత్మా గాంధీ చూపిన మార్గం భవిష్యత్తు తరాలకు ఆదర్శమని ప్రపంచం భారతదేశాన్ని శాంతియుత దేశంగా చూడడానికి కారణం మహాత్మా గాంధీ అనుసరించిన అహింసా విధానమేనని ఆయన అన్నారు..ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ జిల్లా కార్యదర్శి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి వెంకట్ రెడ్డి మాజీ ఎంపిపి కేతిడి వీరారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నన్నెబొయిన రమేష్ యాదవ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రాములు మండల ఉపాధ్యక్షులు మల్లారెడ్డి ఈర్యా నాయక్ మండల కార్యదర్శి చేవ్వ వెంకన్న కోశాధికారి చిప్ప లక్ష్మణ్ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య భాస్కర్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి హరీష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరె కుమార స్వామి మాజీ ఉప సర్పంచ్ కాసాని రమేష్ నాయకులు బొంత శ్రీను కుండే కుమార స్వామి మహిళ కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు బండి పద్మ యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కందిక ప్రవీణ్ కుమార్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు తప్పేట వెంకటేశ్వర్లు నాయకులు ఖాదర్ పేట గ్రామాల అధ్యక్షుడు మహేందర్ మాజీ అధ్యక్షుడు కంచ ప్రభాకర్ పెండ్లి రాజేందర్ కందిక సునీల్ హంస భద్రయ్య కొమురయ్య ఇంద్రయ్య యువజన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు లక్క రాజు కుండే రవి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter