సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : మండలంలోని హన్మయ్యగూడెంలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, అర్డిఓ జగదీష్ రెడ్డి లు పరిశీలించారు.ప్రజల నుండి దరఖాస్తులు తీసుకునే విధానం, ప్రథమ చికిత్సకేంద్రం ఏర్పాటు,క్రమపద్ధతిలో కౌంటర్ ల ద్వారా ప్రజలకు కల్పించిన సౌకర్యాల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల నుండి జనవరి 6 తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటామని ప్రజలందరు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శంకర్,ఎంపిటిసిల ఫోరమ్ జిల్లా కార్యదర్శి మీసాల ఉపేందర్,తహశీల్దార్ వాలే శ్రీదేవి,మండల పంచాయతీ అధికారి దయాకర్, సర్పంచ్ కందుకూరి సరిత ఇంద్రారెడ్డి, విద్యుత్ ఎస్ఈ వెంకటేశ్వర్లు,గ్రామటీమ్ లీడర్ ఝాన్సి, పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి,అంగన్వాడీ టీచర్ మనెమ్మ, వైద్య సిబ్బంది నాగేంద్ర,ఉపేంద్ర, ఇతర శాఖల సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin