Monday, 27 July 2026 04:22:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెంలో కొలువుదీరిన తాజ్ మహల్ ఎగ్జిబిషన్...

Date : 13 October 2023 10:28 AM Views : 322

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని పాత బస్ డిపో ప్రాంగణంలో బిఎల్ఏ ట్రేడ్ ఫెయిర్ వారి తాజ్ మహల్ ఎగ్జిబిషన్ సందడి నెలకొంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ అంత కూడా కోలాహలంగా సాగుతోంది. ఈ ఎగ్జిబిషన్‌ను చూడటానికి చిన్నా, పెద్ద అంత తరలివస్తున్నారు. ప్రధాన నగరాల నుంచి వైవిధ్య రకాల వస్తువులు ఈ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయి. దాదాపు 70కి పైగా స్టాళ్లను పైగా ఏర్పాటు చేశారు. సూది నుంచి అత్యాధునిక వస్తువుల వరకు ఎగ్జిబిషన్ లో దొరకని వస్తువే ఉండదని నిర్వాహకులు తెలిపారు. ఈ వస్తువులను కొనడానికే కాదు చూడటానికి కూడా అధిక సంఖ్యలో జనం వస్తుంటారని ప్రజలు చూసేందుకు వీలుగా అన్ని రోజుల్లోనూ సాయంత్రం 5 గంటల నుంచి 10గంటల వరకు ఎగ్జిబిషన్‌ను కొనసాగిస్తున్నట్టు వారు తెలిపారు. వివిధ రకాల వస్తువులతో పాటు నోరూరించే ఆహార పదార్థాలు, కాలక్షేపం తాజ్ మహల్ ఎగ్జిబిషన్ అదనపు ఆకర్షణ. కుటుంబంతో పాటు వెళ్లిన వారు ఓ మూడు, నాలుగు గంటలు బాగా ఎంజాయ్ చేసేయొచ్చు. సరికొత్త ప్రోడక్టుల గురించి తెలుసుకొని, నచ్చినవి కొని, ఇష్టంగా తిని.. చివరకు పిల్లలతో కలిసి జైయింట్ వీల్ లాంటి సరదాలు తీర్చుకొని ఆనందంగా ఇంటికి తిరిగి రావచ్చు. తాజ్ మహల్ ఎగ్జిబిషన్లో పిల్లలకు కావాల్సిన ఎంజాయ్‌మెంట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. రకరకాల జాయింట్ వీళ్లలో తిరిగి, జారుడు బల్లలపై ఆడుకొని సరదా తీర్చుకుంటారు. యువతీ యువకులు, పిల్లలు ,పెద్దలు కూడా వీటిపై ఆసక్తి చూపిస్తూ ఎంజాయ్ చేసే అవకాశం విశేషం. సందర్శకులను ఆహ్లాదపరిచేలా ఈ తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. దసరా సెలవులు ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులతో పాటుగా చుట్టుపక్కల వారంతా కూడా తాజ్ మహల్ ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చిన సందర్శకులను ఆహ్లాదపరిచేలా ఉంది. ఆగ్రాను తలపించేల కొత్తగూడెంలో ఎగ్జిబిషన్ ఉందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యక్రమంలో నిర్వాహకులు కొయ్య భాను శివప్రసాద్, నందివాడ గురుగోపినాథ్, పైడి రమణ, యేండ్రెడ్డి శ్రీనివాస్, మేనేజర్ ఏలూరి సాయి కుమార్, ఇంచార్జి షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :