సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్నగర్ స్థానిక ఉస్మానియా మసీద్ వక్స్ షాపింగ్ కాంప్లెక్స్ లో అక్రమ పద్ధతిలో తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి షాపులు అమ్మకాలు కొనుగోలులు జరుగుతున్నాయి.. నూతన షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ ... భూలక్ష్మి అనే కిరాయిదారురాలు వక్స్ బోర్డ్ ఆస్తిని కాజేయడం కోసం లక్షల రూపాయలకు అక్రమ మార్గంలో అమ్మకం చేసేందుకు తప్పుడు పత్రాలు సృష్టించి ఇట్టి షాపును వేరే వారి పేరు మీదికి మార్చాలని వోక్స్ బోర్డ్ అధికారులకు దరఖాస్తు చేయడంతో విషయం బట్టబయలైంది.. ఇట్టి విషయమై గత కొద్ది రోజులుగా ముస్లిం సోదరులు వివిధ రూపాలలో ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసి ఆందోళన చేస్తున్న వోక్స్ బోర్డ్ అధికారులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారు.గత రాత్రి హుజూర్ నగర్ కి విచ్చేసిన సంబంధిత వక్స్ బోర్డు అధికారులు 5 ను స్వాధీనం చేసుకోకుండా మరియు దామెర్ల భూలక్ష్మి పై క్రిమినల్ కేసు నమోదు చేయకుండా స్వాధీనం చేసుకుంటామని చెప్పి తాళాలు తెప్పించి కొద్ది నిమిషాలలోనే యూటర్న్ తీసుకొని వెనక్కి పోవడంలో జరిగిన మతలబేమిటో అనే అనేక అనుమానాలు ముస్లిం సోదరులకు తావిస్తున్నాయి ఎవరి ప్రలోభాలకు వక్స్ బోర్డు అధికారులు లొంగుతున్నారు..* ఆస్తులు కాపాడాల్సిన వారే అక్రమ దారులకు మద్దతు తెలుపుతున్నారా ఇట్టి విషయంలో ముస్లిం సోదరులు సహించేది లేదని వర్క్స్ బోర్డ్ అధికారులు షాపు నెంబర్ 5 స్వాధీనం చేసుకోకుండా ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తే పోరాటాన్ని ఉదృతం చేస్తామని అధికారులకు ఈ సందర్భంగా హెచ్చరించారు.. ఇట్టి విషయమై రేపు శుక్రవారం హుజూర్నగర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం కోసం సమావేశంలో తీర్మానించడం జరిగిందని అలాగే రాష్ట్ర వక్స్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని పత్రికలకు విడుదల చేసిన సమావేశంలో ఎండి. అజీజ్ పాషా పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో *ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు నవాబ్ జాని, ఎండి జిలాని, పఠాన్ పహిల్వాన్,మజీద్,ఇబ్రహీం, ఎస్.కె రసూల్,ఎండి బాబా,ఎండి జానీ మియా, ఎండి రహీం,బాజీ,భాష, నయీమ్, మోహిన్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin