సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా లో 113 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం బ్యాంక్ సిబ్బంది యోగ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఖాతాదారుల సమావేశంలో బ్యాంక్ ఖాతాదారులు బ్యాంక్ సేవలను కొనియాడారు. సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా సిబ్బoది చాలా చక్కగా సేవలను అందిస్తున్నారని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో రీజనల్ హెడ్ శ్రీ పంకజ్ కుమార్ మాట్లాడుతూ బ్యాంక్ 113 వ వ్యవస్థాపక దినోత్సవం లొ భాగంగా మరింత బాగా సేవ లు అందిస్తామని, డిజిటల్ బ్యాంకింగ్ ను సరళ మైన బ్యాంకింగ్ కోసం అందిస్తున్నామని, బ్యాంక్ మరియు ఆర్థిక అవసరాలను తీర్చడానికి సెంట్రల్ బ్యాంక్ ఎల్లప్పుడూ సిద్దంగా వుంటుందని, ఖాతాదారులు, ప్రజలు తమ బ్యాంక్ సేవల ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు . హౌజ్ ఆఫ్ జాయ్ లొ బట్టలు, మరియు ఫ్రూట్స్న్ ను రీజనల్ హెడ్ శ్రీ పంకజ్ కుమార్ గారు, అందరికీ పంచి పెట్టారు. వారితో పాటు చీఫ్ మేనేజర్ చేతన్ కుమార్, నక్కలగుట్ట శాఖ మేనేజర్ ముత్యాల. మురళి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin