సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తల్లిదండ్రులు అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చూడాలని, వారిలో ఆత్మవిశ్వాసాన్నీ పెంపొందించడం ద్వారా ప్రతి సమస్యను వారు ధైర్యంగా ఎదుర్కొనేలా స్ఫూర్తిని నింపాలని న్యాయమూర్తి శ్యాంమ్ శ్రీ కోరారు. సోమవారం బాబు క్యాంపు లోని బృందావనం చిల్డ్రన్ పార్కులోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సెక్షన్ 125 సి.ఆర్పి.సి ప్రకారం భర్త నుండి భార్య త్వరితగతిన భరణం ను పొందవచ్చని తెలిపారు. లింగ సమానత్వాన్ని సాధించడం ద్వారా సమాజంలో మహిళల ప్రాథన్యత పెరుగుతుంది అని తెలిపారు. న్యాయవాదిని నియమించుకోలేని సోమత లేని నిరుపేదల కోసం సత్వర న్యాయాన్ని అందించడానికి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆపన్న హస్తంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది లక్కినేని సత్యనారాయణ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ నుండి చీఫ్ వి.పురుషోత్తమరావు, డిప్యూటీ నిరంజన్ రావు, జమాతే మహిళ జిల్లా అధ్యక్షురాలు పర్వీన్ ముస్తాఫా, కొత్తగూడెం జమాతే హిందూ ఇస్లాం ఆర్గనైజర్ షహనాజ్, బీసీ సంఘం అధ్యక్షురాలు మునిలా, లీగల్ సర్వీసెస్ మెంబర్స్ రాజమల్లు, సాదిక్ పాషా, కాసాని రమేష్, సజహన్ పర్వీన్, అసిస్టెంట్ కౌన్సిల్స్ నాగ స్రవంతి జ్యోతి, విశ్వకర్మ లీగల్ సర్వీసెస్ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు.
-----------------------
Admin