సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని... బీఆర్ఎస్ యువ నాయకులు ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో గ్రామ యువకులు, సల్ల యాదగిరి. ఇంద్రసేన రెడ్డి, ఎన్ రమేష్ యాదవ్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి పలువురు యువకులు, యువజన సంఘాల నాయకులు ఇతర పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువతకు గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజక వర్గంలో టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందుతారని వారు అన్నారు.
-----------------------
Admin