Monday, 27 July 2026 03:42:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధన కోసం పనిచేయాలి...

Date : 20 May 2024 11:52 AM Views : 391

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు మండల కేంద్రంలో నిరాడంబరుడు నిస్వార్థ సేవకుడు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ మరియు మండల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ మాట్లాడుతూ కామ్రేడ్ సుందరయ్య జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని ఆయన అన్నారు భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ తన చిన్ననాటి తల్లిదండ్రులను ఎదిరించి కుల వివక్షను అంతమొందించేందుకు పనిచేసిన గొప్ప ఆదర్శమూర్తి అని వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి కూలిపోరాటాలు నిర్వహించి వారిలో చైతన్య నింపిన మహనీయుడని ఆయన అన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించినారని దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని విస్తరించ చేయడంలో ఆయన కృషి మరువలేనిదని పార్టీ నిర్మించడమే కాక ప్రజాప్రతినిధిగా పార్లమెంటు సభ్యునిగా ఎమ్మెల్యేగా 17 సంవత్సరాలు పనిచేస్తూ పార్లమెంటుకు అసెంబ్లీకి సైకిల్ పై నిరాడంబరంగా వెళ్లిన గొప్ప వ్యక్తి అని అన్నారు ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గలమెత్తితే అప్పటి ప్రధాని సుందరయ్య ప్రసంగాన్ని శ్రద్ధతో విని విమర్శలు సరిచేసుకునే ప్రయత్నం చేసేవారని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధన అంటే పాలకుల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళులు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడిగుంట్ల పాలెం ఎంపీటీసీ దొంగల వెంకటయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టేష్ మండల నాయకులు దిద్దకుంట్ల పురుషోత్తం రెడ్డి, మాతంగి ఏసురత్నం, కొండచిన్నల్లయ్య,రవి, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :